మనకోసం ఈ సమావేశం.. మనమందరం కలుద్దాము.. ఒకరికొకరం అన్నట్లుగా ఉందాము.. ఒకరికొకరం సహాయం చేసుకుందాం అనే గొప్ప సందేశంతో ఈసారి ఫేస్ బుక్ పాజిటివ్ మైండ్స్ సమావేశం జరిగింది..
చలికాలం, చల్లగా కృష్ణకాంత్ పార్క్ లో మద్యాహ్నం 3 గంటల వేళ పచ్చని పచ్చిక పై ఆహ్లాదంగా ప్రారంభమైంది. కొత్తవారు, మంచి ఆలోచనలు కలవారు, ఫేస్ బుక్ ఇలా ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు అన్న ఆలోచనా సరళి కలవారు కలిసి కాసేపు అప్పటి కార్యాచరణాల గురించి, భవిష్యత్తులో ఏవిధమైన కార్యాచరణాలను అమలు చేయవచ్చు అనే విషయాలపై కాసేపు మాట్లాడుకుని.. అపరిచితులంతా సుపరిచితులై ...ఏ చిన్న అవసరమైనా మనమున్నాము అన్న భరోసాతో "మేము సైతం" అందాము అని తీర్మానించారు.
ఈసారి కార్యక్రమంలో అందరి పరిచయాల తరువాత పెద్దవారు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఇలా ఇక్కడ క్లుప్తంగా...
********
శ్రీ బ్రహ్మానందంగారు: ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా వెనబడివున్న గిరిజనులకు మనకు చేతనైనంత సహాయము చేద్దాము అని పిలుపినిచ్చారు. ఎదో రకంగా అంటే మనకు తెలిసిన ఆరోగ్య సూచనలు ఇస్తూ..తెలిసినంతలో వారికి విధ్యా బుద్ధులు నేర్పిస్తూ, అల్లూరి సితారామరాజు ఏవిధంగా వారిని చైతన్యవంతులని చేశారో అలాగే మనకు చేతనైంతవరకు వారికి తోడ్పడదామని సందేశమిచ్చారు.
చివర్లో రోడ్డు ప్రమాదాల గురించి వాటి నివారణ గురించి.. గంగాధర తిలక్ గారు మాట్లాడుతున్నప్పుడు.. "ప్రమాదాలు ప్రమోదం కాదు " అని సరదాగా అంటూ ప్రమాదాలు కొని తెచ్చుకొవద్దని తనదైన శైలిలో యువతకి సలహా ఇచ్చారు బ్రహ్మానందంగారు.
![]() |
| Add caption |
శ్రీ కట్నం గంగాధర తిలక్ గారు: వీరు శ్రమదాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అన్నది విశ్లేషిస్తూ.. వాటి నివారణకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వివరించారు. శ్రమదాన్ ఫౌండేషన్ ముఖ్యోద్దెశ్యం ప్రమాదాలు జరకుండా చూడడమే అని చెప్పారు.
శ్రమదానం చేయమని యువతకి అక్కడ హాజరైన మిత్రులకి పిలుపునిచ్చారు. అనాధలకి అభాగ్యులకి మనకి చేతనైంత చేయూత నిద్దమంటూ కొత్త అప్లికేషన్ మనం ఒక ఎస్ ఎం ఎస్ పంపిస్తే (ప్రమాదం కాని సహాయం గురించి కాని) ఎక్కడనుండి పంపిచామో అడ్రెస్స్ తో సహా వారికి చేరే అవకాశం ఉందని పరిచయం చేశారు. వివరాలు అంటూ అవసరం లేకుండా సదా మీ సమక్షంలో అనట్లు ఉండే అప్లికేషన్ అని విడమర్చి వివరించారు. వీరికో గ్రూప్ కూడా ఉంది ఫేస్ బుక్ లో " "శ్రమదాన్" అసక్తి కలవారికి ఆహ్వానం అంటున్నారు కట్నం గంగాధర తిలక్ గారు.
శ్రీ మాధవ రెడ్డి గారు: ఎక్కడ సహాయం అవసరమో అక్కడ నేను ఉంటాను అంటున్నారు .. మాధవ రెడ్డి గారు. తన ఊరిలో తనే 1st ఉన్నత చదువులు చదివిన వ్యక్తినని, తనలా తన ఊరిలో అందరూ చదవాలని తన ఆకాంక్ష అని, అలాగే ఎవరు లేని వారుకి తానున్నాను అని భరొసా ఇస్తూ.. తను ఏవిధంగా ఎంతమందికి ఆపన్న హస్తమయ్యారో, అందుకు తాను పడిన కష్టాలు, వాటి వల్ల చేరుకున్న విజయ పధాలు అన్నిటినీ కూలంకషంగా వివరించారు.
శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు: మనం కూడా పాశ్చాత్య సాంప్రదాయాలకి, అపార్ట్మెంట్ కల్చర్లకి అలవాటు పడిపోతున్నాము.. పదిమందిమి కలుద్దామనే ఆలోచన అనేది ఉండడం లేదు, ఇంటికొచ్చిన వారితో కూడా మనః పూర్వకంగా మాట్లాడలేకపోతున్నాము , ఎదో ఒక ఆధునిక సాంకేతిక పరికారాలతో మనల్ని మనం బంధించేసుకుంటూ బంధుత్వాలకి దూరమవుతున్నాము. దీనివల్ల మనుషుల్లో సున్నితత్వం అనే భావన దూరమయిపోతోంది. ఇలాంటి పరిస్థితే కొనసాగితే ముందు ముందు ఇప్పుడొచ్చిన వారు కూడా రాలేరు.
ఇక చివర్లో వచ్చినా చాలా చక్కని సందేశమిచ్చారు శ్రీ రమేష్ గారు తాను రెండు సార్లు వద్దామనుకుంటూ రాలేకపోయానని.. ఈసారి తప్పక రావాలని నిశ్చయించుకుని, నైట్ డ్యూటి చేసి వచ్చాననై ఈసారి ఎవరినీ కలవలేనని ఆందోళన కలిగిందని.. అదృష్టవశాత్తు కలవగలిగానని ఆనందించారు రమేష్ గారు.
నిజానికి మన ముందు జెనరేషన్ వారికన్నా మనమెంతో అదృష్టవంతులమని, మనం కష్టపడకుండా మనకోసమంటూ ఎన్నో కనుక్కోబడ్డాయని, వాటిని సౌకర్య్వంతంగా ఉపయోగించడమే మనకి చేత కావడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు రమేష్ గారు, ఉదా: సైకిల్, కంప్యూటరు, పలురకాల సాంకేతిక సౌకర్యాలను మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నామని అన్నారు. .. అలాగే మనం సంపాదించే 10 రూపాయలలో ఒక్క రూపాయి సహాయానికి ఉపయోగించినా చాలు అని తన సహాయక పధకాన్ని వివరించారు.
శ్రీ విక్రం గారు: తన తమ్ముడు తాను ఎంత చెప్పినా కంప్యూటర్ నేర్చుకోలేకపోయాడని, చివరికి శ్రీధర్ గారి వీడియోల ద్వారా స్ఫూర్తి పొంది కంప్యూటరు నేర్చుకున్నాడని, అందుకు సభాముఖంగా శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసూ.. ఒకప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత పవిత్రమైనవో, మన బంధాలు, బంధుత్వాలు ఎంతటి నిజాయితీ గా ఉండేవో చెప్పడానికి రామాయణంలోని ఒక సన్నివేశాన్ని ఎంతో ఆర్థ్రతో వివరించారు. "సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకునివెళ్తున్నప్పుడు తన ఆభరణాలను రామలక్ష్మణులు గుర్తుపట్టడానికి వీలుగా మూటకట్టి , రావణుని ద్వారా గాయపడ్డ ఝఠాయువుకి తెలిసేలా కిందపడేసినప్పుడు గాయపడ్డ ఝఠాయువు తనేమి చేయలేనని నిస్సహాయురాలినని రాముని క్షమించమని వేడుకుంటూ, ఆ అభరణాల మూటని భద్రంగా ఒక చెట్టు తొఱ్ఱలో ఉంచుతుందిట. వాటిని హనుమంతుడు కనుగొని శ్రీరాముని చెంతకి తీసుకొని వస్తాడు.
శ్రీరాముడు బాధాతత్ప్తుడై కన్నీటి ధారలో వాటిని గుర్తించలేక లక్ష్మణుడి చేతికి ఇస్తాడట ఒకసారి చూడమని, అవి సీతాదేవివా కాదా అని, అప్పుడు లక్ష్మణుడు ఈవిధంగా అంటాడట. సోదరా.. ఈ అభరణాలేమిటో వాటిని వదైనగారు ధరించారో లేదో కూడా నాకు తెలీదు కాని ఒక్కటి మటుకు నేను గుర్తు పట్టగలను.. వదినగారి పాదాల చెంత ఉండేవాడిని కాబట్టి ఆవిడ కాలి మంజీరాలను(పట్టీలను) గుర్తు పట్టగలను అని అన్నాడట.. కన్నీటితో..ఇలాంటి బాంధవ్యాలు మనవి అవి కొరవడుతున్నాయి వాటిని కాపాడుకుందాము. మన సంస్ఖ్రితిని సాంప్రదాయాలను మనం ఆచరిద్దామని చక్కగా వివిరంచారు విక్రం గారు.
ఇంకా కొందరు డాట్ నెట్ కి సంబంధించి కోర్స్ సెంటర్ మాదాపుర్ లో ఉందని... నేర్చుకోవాలనుకున్నవారు అక్కడ కోచింగ్ బాగుందని ఇలా చాలా చాలా విషయాలు తెలియజేశారు.
అలా ఈరోజు సమావేశం "సేవ చేద్దాము " మనం పలువురికి తోడ్పడదాం అన్న ముఖ్యోద్దేశ్యంతో మొదలయి ఒక సంకల్పంతో ముగిసింది.
ఈ సమావేశంలో వచ్చిన అంశాలన్నీ ఇక్కడ ప్రస్తావించాననే అనుకుంటున్నాను. ఏమన్నా, ఎవరినన్నా మర్చిపోతే క్షమించి మీ ఆలోచనలను ఇక్కడ కామెంట్ ద్వారా పొందుపర్చవచ్చు. నమస్సులతో.. రమణి.
******
మీట్ లో తీసిన మరిన్ని ఫోటోలు.
గమనిక: నేను ఈ పోస్ట్ రాసినప్పుడు ఇంకా గ్రూప్ తెరవలేదు.. నల్లమోతు శ్రీధర్ గారు సాంకేతిక పరంగా గాని, మరేవిధమైన సహాయం కావాలన్నా.. లేదా చెయ్యాలనుకున్న హితులు సన్నిహితులు, సహృదయులు, స్నేహితులు, ఫేస్ బుక్ ధారులు ఎవరయినా సరే ఈ గ్రూప్లో ( click here) చేరవచ్చు అంటూ ఫేస్ బుక్ పాజిటివ్ మైండ్స్ పేరిట ఒక గ్రూప్ తెరిచారు . కాబట్టి మిత్రులందరూ తమ విలువైన సమయాన్ని కొంచం ఇటు మర్లించి, సహాయసహకారాలుపొందవచ్చు/అందిచవచ్చు. వినమ్రతతో రమణి.



































